లిబరేషన్ టవర్ సందర్శనకు పోటెత్తిన సందర్శకులు
- February 28, 2023
కువైట్: కువైట్ జాతీయ, విముక్తి రోజుల సందర్భంగా లిబరేషన్ టవర్ సందర్శనకు సందర్శకులు పోటెత్తారు. దాదాపు 8 వేల మందికంటే ఎక్కువగా పౌరులు, నివాసితులు, దౌత్యవేత్తలతో సహా సందర్శకులు లిబరేషన్ టవర్ ను సందర్శించినట్లు టెలి-కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లిబరేషన్ టవర్ గత గురువారం నుండి రెండు షిఫ్టులలో ప్రజల కోసం అందుబాటులో పెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థలు, ప్రజా సంఘాలు, సాంస్కృతిక వాలంటీర్లచే వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహించారు. 150 మీటర్ల ఎత్తులో ఉన్న టవర్ను సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







