ఖతార్లో ‘కరీమ్’ సేవలు నిలిపివేత
- February 28, 2023
ఖతార్: ఉబెర్ మిడిల్ ఈస్టర్న్ బిజినెస్ కంపెనీ అయిన ‘కరీమ్’ మంగళవారం నుండి ఖతార్లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తమ వినియోగదారులకు సందేశాలను పంపింది. ఇటీవల ఖతార్లో జరిగిన ప్రపంచ కప్ లో ఉబెర్, స్థానిక టాక్సీ ప్రొవైడర్ కర్వా కార్లతో పాటు సందర్శకులను, ఫుట్ బాల్ అభిమానులను రవాణా చేయడానికి టోర్నమెంట్ అధికారిక ప్రణాళికలలో కరీమ్(Careem) వాహనాలు కూడా ఉన్నాయి. "దురదృష్టవశాత్తూ కరీమ్ రైడ్ హెయిలింగ్ కార్యకలాపాలు ఫిబ్రవరి 28 నుండి ఖతార్లో పనిచేయవు" అని కస్టమర్లకు పంపిన మెసేజ్ లో కంపెనీ పేర్కొంది. అయితే, కరీమ్ క్రెడిట్ను కలిగి ఉన్న కస్టమర్లకు మార్చి 15 నాటికి పూర్తి రీఫండ్ను అందజేస్తామని తన మెసేజ్ లో తెలియజేసింది. కాగా, కరీమ్ తన కార్యాకలాపాలను ఎందుకు నిలిపివేస్తుందో అన్న విషయంపై మాత్రం కంపెనీ వివరణ ఇవ్వలేదు. ఊబర్ టెక్నాలజీస్ 2019లో $3.1 బిలియన్లకు కరీమ్ను కొనుగోలు చేసింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







