ఖతార్లో ‘కరీమ్’ సేవలు నిలిపివేత
- February 28, 2023
ఖతార్: ఉబెర్ మిడిల్ ఈస్టర్న్ బిజినెస్ కంపెనీ అయిన ‘కరీమ్’ మంగళవారం నుండి ఖతార్లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తమ వినియోగదారులకు సందేశాలను పంపింది. ఇటీవల ఖతార్లో జరిగిన ప్రపంచ కప్ లో ఉబెర్, స్థానిక టాక్సీ ప్రొవైడర్ కర్వా కార్లతో పాటు సందర్శకులను, ఫుట్ బాల్ అభిమానులను రవాణా చేయడానికి టోర్నమెంట్ అధికారిక ప్రణాళికలలో కరీమ్(Careem) వాహనాలు కూడా ఉన్నాయి. "దురదృష్టవశాత్తూ కరీమ్ రైడ్ హెయిలింగ్ కార్యకలాపాలు ఫిబ్రవరి 28 నుండి ఖతార్లో పనిచేయవు" అని కస్టమర్లకు పంపిన మెసేజ్ లో కంపెనీ పేర్కొంది. అయితే, కరీమ్ క్రెడిట్ను కలిగి ఉన్న కస్టమర్లకు మార్చి 15 నాటికి పూర్తి రీఫండ్ను అందజేస్తామని తన మెసేజ్ లో తెలియజేసింది. కాగా, కరీమ్ తన కార్యాకలాపాలను ఎందుకు నిలిపివేస్తుందో అన్న విషయంపై మాత్రం కంపెనీ వివరణ ఇవ్వలేదు. ఊబర్ టెక్నాలజీస్ 2019లో $3.1 బిలియన్లకు కరీమ్ను కొనుగోలు చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







