ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్..
- March 01, 2023
విశాఖపట్నం: విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు కొత్త చిక్కొచ్చిపడింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. వీరిలో కొంత మంది ప్రత్యేక విమానాల్లో విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానాల పార్కింగ్ సమస్య తలెత్తనుంది. మొత్తం 25 కు ఫైగా ప్రత్యేక విమానాలు వస్తున్నట్టు అధికారులకు సమాచారం ఉంది.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో 18 విమానాలకు సరిపడా పార్కింగ్ మాత్రమే ఉందని అధికారులు వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఎక్కువ విమానాలు వస్తే పార్కింగ్ సమస్య ఎదురవుతుందని భావిస్తున్నారు. కాగా, ఈ సమస్యను పరిష్కరించేందుకు రాజమండ్రి విమానాశ్రయంలో పార్కింగ్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ఏయూలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది.
ఆంధ్రా యూనివర్సిటీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పనులను పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి 10 టీవీతో మాట్లాడుతూ.. ఉద్యోగాలు, ఆదాయ వనరులు పెంచుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టే వారికి 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని తెలిపారు. 14 సెక్టార్లుల్లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని, రూ.2 లక్షల కోట్లుకు పైగా పెట్టుబడుల వస్తాయని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. 25 దేశాలకు చెందిన 10 వేల మందికి పైగా ప్రతినిధులు వస్తున్నారని అన్నారు.
కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకువస్తున్నామని, ఎన్నికల కోడ్ అభ్యంతరం లేకపోతే ఈ సదస్సులోనే ప్రకటిస్తామని మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల ప్రయోజనాలు గురించి పెట్టుబడిదారులకు వివరిస్తామని.. దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు. సీఎం జగన్ 2వ తేది సాయంత్రం వచ్చి.. 4న తిరిగి వెళతారని తెలిపారు. రాష్ట్ర దశ దిశ మార్చే విధంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







