జహ్రా నేచర్ రిజర్వ్ మూసివేత
- March 01, 2023
కువైట్: సీజన్ ముగింపును సూచిస్తూ జహ్రా రిజర్వ్ను మూసివేస్తున్నట్లు ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ (EPA) ప్రకటించింది. 2022/2023 సీజన్లో రిజర్వ్కు ఆన్లైన్ బుకింగ్ ద్వారా 3,000 మంది సందర్శకులు సందర్శించారు. ఈ సందర్భంగా సందర్శకులకు పర్యావరణం, వివిధ పర్యావరణ అబ్జర్వేటరీల గురించి అవగాహన కల్పించినట్లు అథారిటీ పేర్కొంది. కువైట్లోని వివిధ దేశాల రాయబార కార్యాలయాల భాగస్వామ్యంతో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల కారణంగా ఈ సంవత్సరం రిజర్వ్ను సందర్శించే వారి సంఖ్య పెరిగిందని తెలిపింది. వందల సంఖ్యలో వివిధ రకాల చెట్లను, ముఖ్యంగా మడ చెట్లను నాటినట్లు తెలిపారు. రిజర్వ్లో వేల సంఖ్యలో వలస పక్షులు, ప్రత్యేకించి డేగలు, ఒక దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్ళే కాలంలో చాలా దూరం ప్రయాణించాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







