2023 చివరి నాటికి రియాద్ మెట్రో పూర్తి
- March 01, 2023
రియాద్ : రియాద్ మెట్రో ప్రాజెక్టును 2023 చివరిలోగా లేదా 2024 ప్రారంభంలో పూర్తి చేస్తామని రియాద్ మేయర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ అయ్యఫ్ తెలిపారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పష్టం చేశారు. రియాద్ మెట్రో ఇప్పటికే ఉన్న నగరంలో అమలు చేయబడిన అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్గా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. రియాద్ మెట్రో మొత్తం 84 స్టేషన్లతో 6 లైన్లను కలిగి ఉంటుందని ప్రిన్స్ ఫైసల్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో మెట్రో దోహదపడుతుందని, ముఖ్యంగా సౌదీ రాజధానిలో 90% ప్రయాణాలు కార్లపైనే ఆధారపడ్డాయని వివరించారు. రియాద్లో పబ్లిక్ పార్కింగ్ ప్లాన్కు సంబంధించి, మొదటి దశను ఇటీవల ప్రకటించినట్లు ప్రిన్స్ ఫైసల్ గుర్తుచేశారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో సెంట్రల్ ఏరియాపై దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో రియాద్లో పబ్లిక్ పార్కింగ్ల ప్రణాళికను అమలు చేస్తామని ప్రిన్స్ ఫైసల్ చెప్పారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!







