మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం..
- March 02, 2023
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
కియారా అద్వానీ, క్రితి సనన్ డాన్స్ పెర్ఫామెన్స్తోపాటు పంజాబీ ర్యాపర్ ఏపీ ధిల్లాన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకకు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేడుకల సందర్భంగా బీసీసీఐ ఒక ఆఫర్ ప్రకటించింది. మహిళలకు టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనుంది. మ్యాచ్ చూడాలనుకునే వాళ్లు ఉచితంగానే స్టేడియానికి హాజరుకావొచ్చు. మొదటి మ్యాచ్ ముంబై-గుజరాత్ మధ్య జరుగుతుంది. మార్చి 26 వరకు టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో ఐదు జట్లు పాల్గొంటున్నాయి.
అవి ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్. ఐపీఎల్ మ్యచుల్ని జియో సినిమా యాప్ లేదా వెబ్లో లైవ్లో ఉచితంగా చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ 18 నెట్వర్క్ ఛానెల్లోనూ వీక్షించవచ్చు. ఈ టోర్నీలో అన్ని మ్యాచులు ముంబైలోనే జరుగుతాయి. ఇతర ప్రాంతాల్లో మ్యాచులు నిర్వహించడం లేదు. ప్రతి మ్యాచ్ ప్రారంభ టిక్కెట్ ధర రూ.100గా ఉంది. ఇప్పటికే చాలా వరకు టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఐపీఎల్లాగే డబ్ల్యూపీఎల్కు కూడా మంచి ఆదరణ దక్కుతుందని బీసీసీఐ, జట్టు యాజమాన్యాలు ధీమాతో ఉన్నాయి. డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









