మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం..
- March 02, 2023
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
కియారా అద్వానీ, క్రితి సనన్ డాన్స్ పెర్ఫామెన్స్తోపాటు పంజాబీ ర్యాపర్ ఏపీ ధిల్లాన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకకు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేడుకల సందర్భంగా బీసీసీఐ ఒక ఆఫర్ ప్రకటించింది. మహిళలకు టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనుంది. మ్యాచ్ చూడాలనుకునే వాళ్లు ఉచితంగానే స్టేడియానికి హాజరుకావొచ్చు. మొదటి మ్యాచ్ ముంబై-గుజరాత్ మధ్య జరుగుతుంది. మార్చి 26 వరకు టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో ఐదు జట్లు పాల్గొంటున్నాయి.
అవి ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్. ఐపీఎల్ మ్యచుల్ని జియో సినిమా యాప్ లేదా వెబ్లో లైవ్లో ఉచితంగా చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ 18 నెట్వర్క్ ఛానెల్లోనూ వీక్షించవచ్చు. ఈ టోర్నీలో అన్ని మ్యాచులు ముంబైలోనే జరుగుతాయి. ఇతర ప్రాంతాల్లో మ్యాచులు నిర్వహించడం లేదు. ప్రతి మ్యాచ్ ప్రారంభ టిక్కెట్ ధర రూ.100గా ఉంది. ఇప్పటికే చాలా వరకు టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఐపీఎల్లాగే డబ్ల్యూపీఎల్కు కూడా మంచి ఆదరణ దక్కుతుందని బీసీసీఐ, జట్టు యాజమాన్యాలు ధీమాతో ఉన్నాయి. డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







