మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం..
- March 02, 2023
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
కియారా అద్వానీ, క్రితి సనన్ డాన్స్ పెర్ఫామెన్స్తోపాటు పంజాబీ ర్యాపర్ ఏపీ ధిల్లాన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకకు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేడుకల సందర్భంగా బీసీసీఐ ఒక ఆఫర్ ప్రకటించింది. మహిళలకు టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనుంది. మ్యాచ్ చూడాలనుకునే వాళ్లు ఉచితంగానే స్టేడియానికి హాజరుకావొచ్చు. మొదటి మ్యాచ్ ముంబై-గుజరాత్ మధ్య జరుగుతుంది. మార్చి 26 వరకు టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో ఐదు జట్లు పాల్గొంటున్నాయి.
అవి ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్. ఐపీఎల్ మ్యచుల్ని జియో సినిమా యాప్ లేదా వెబ్లో లైవ్లో ఉచితంగా చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ 18 నెట్వర్క్ ఛానెల్లోనూ వీక్షించవచ్చు. ఈ టోర్నీలో అన్ని మ్యాచులు ముంబైలోనే జరుగుతాయి. ఇతర ప్రాంతాల్లో మ్యాచులు నిర్వహించడం లేదు. ప్రతి మ్యాచ్ ప్రారంభ టిక్కెట్ ధర రూ.100గా ఉంది. ఇప్పటికే చాలా వరకు టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఐపీఎల్లాగే డబ్ల్యూపీఎల్కు కూడా మంచి ఆదరణ దక్కుతుందని బీసీసీఐ, జట్టు యాజమాన్యాలు ధీమాతో ఉన్నాయి. డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







