పర్వతారోహణ నిబంధనల ఉల్లంఘనకు Dh50,000 జరిమానా
- March 02, 2023
యూఏఈ: పర్వతారోహణ నిబంధనలను ఉల్లంఘించి, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే వారికి Dh 50,000 జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు ఫుజైరా అడ్వెంచర్ సెంటర్ (FAC) తీసుకున్న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మార్చి 1 నుండి అమల్లోకి వచ్చింది. ఇటీవల పర్వతాలపై దారితప్పిన వారి సంఖ్య పెరుగుతున్ననేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యత్రాంగం తెలిపింది. కొత్త నిర్ణయం కాలినడకన నడిచే పర్వతారోహకులు, పర్వత సాహస యాత్రల నిర్వాహకులు, ఆమోదించబడిన పర్యాటక సంస్థలకు వర్తిస్తాయని తన ఉత్తర్వుల్లో తెలిపారు. ఫుజైరా అడ్వెంచర్ సెంటర్ డైరెక్టర్ అమ్ర్ జైనుద్దీన్ మాట్లాడుతూ.. పర్వత ప్రాంతాల నివాసితుల సహకారంతో నలుగురు ఇన్స్పెక్టర్లను నియమించామని, ఎమిరేట్లోని 10 పర్వత మార్గాల్లో ఉల్లంఘనలను పర్యవేక్షిస్తారని చెప్పారు. ఔత్సాహికులు, పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందిన క్లైంబింగ్, ఆఫ్-రోడ్ హైకింగ్ క్రీడను నిర్వహించడానికి కేంద్రం విస్తృతమైన అధ్యయనం నిర్వహించిందని జైనుద్దీన్ తెలిపారు. కొత్త నిర్ణయం పర్వత ప్రమాదాల కారణంగా గాయాలు, రెస్క్యూ ఆపరేషన్ల శాతాన్ని తగ్గించగలదని పేర్కొన్నారు. ఎమిరేట్లోని ప్రత్యేక ప్రాంతాలలో 10 పర్వత మార్గాలను కేంద్రం అభివృద్ధి చేసిందని, సేవా సౌకర్యాలు, వారు ఉన్న సైట్ల గురించి ప్రజలకు తెలియజేసే గైడ్ బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ఔత్సాహిక పర్వతారోహణ, పర్యాటక సంస్థలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







