టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
- March 02, 2023
విజయవాడ: టీడీపీ పార్టీ ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.కీలక నేతలంతా పలు కారణాలతో కన్నుమూస్తున్నారు.రీసెంట్ గా నందమూరి తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త నుండి ఇంకా బయటకు రాకముందే పార్టీ లో మరో కీలక నేత కన్నుమూశారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవలే గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయన మరణం పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.1957 జులై 4న కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో.. సుబ్బయ్య- అచ్చమ్మ దంపతులకు బచ్చుల అర్జునుడు జన్మించారు. బి.ఏ వరకు చదివిన ఆయన ఏపీ శాసనమండలికి 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 1995 నుంచి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పని చేశారు.
2000 నుంచి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపాలిటీ ఛైర్మన్గా , 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017లో ఏపీ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో.. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2020 లో టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి దూరం కావడం తో అర్జునుడు గన్నవరం బాధ్యతలు తీసుకున్నారు.ఇక తీసుకున్న కొన్ని రోజులకే హాస్పటల్ పాలవ్వడం ..ఇప్పుడు కన్నుమూయడం జరిగిపోయింది.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







