విరూపాక్ష టీజర్ టీజర్ విడుదల
- March 02, 2023
హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం విరూపాక్ష.ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ గురువారం విడుదలైంది.ఆక్సిడెంట్ తరువాత తేజ్ నటించిన మూవీ ఇది.ఈ సినిమా తాలూకా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ఫై దృష్టి పెట్టారు.ఇప్పటీకే ఈ సినిమా తాలూకా గ్లింప్స్ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది. ఈ గ్లింప్స్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. గంభీరమైన స్వరంతో అతడు ‘అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అంటూ పలికిన డైలాగ్ హైలైట్గా నిలిచింది.
ఇక ఇప్పుడు టీజర్ సైతం అదే రేంజ్ లో ఆసక్తి పెంచింది. ఒక గ్రామంలో ఏదో ఒక సమస్య వస్తుంది. అయితే ఆ సమస్య పరిష్కరించడానికి గ్రామస్తులు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు.తరువాత అదే గ్రామంలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ సమస్యకి గల కారణం వెతికే పనిని హీరో మొదలు పెడతాడు. మరి ఆ గ్రామంలో తలెత్తిన సమస్యని హీరో ఎలా పరిష్కరించాడు అనే పాయింట్ ఈ టీజర్ ద్వారా దర్శకుడు కార్తిక్ దండు చూపించే ప్రయత్నం చేశాడు. మరి ఆ గ్రామంలో తలెత్తిన సమస్య ఏంటి అనేది మనకు ఏప్రిల్ 21 న తెలుస్తుంది. ఆ రోజున ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో కూడా విడుదల చేయనున్నారు.ఈ లోపు మీరు ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







