భారత దేశవ్యాప్తంగా 240కి పైగా రైళ్లు రద్దు..
- March 03, 2023
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ వివిధ కారణాలతో ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దు చేసింది. మెయింటనెన్స్, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన మరో 87 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వీటిలో కాన్పూర్, అసన్ సోల్, ఢిల్లీ, లక్నో, బోకారో స్టీల్ సిటీ, బక్సర్, అమరావతి, వాద్రా, నాగ్ పూర్, పుణె, పఠాన్ కోట్, మదురై, రామేశ్వరంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు ఉన్నాయి. రైళ్లు రద్దైన నేపథ్యంలో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా రైళ్లలో ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపారు. అయితే తాము వెళ్లాల్సిన రైలు.. రద్దైన వాటి జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నారు.
బుధవారం కూడా అధికారులు దేశవ్యాప్తంగా 250కిపైగా రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు మరో 96 రైళ్లను నిలిపివేశారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 351 రైళ్లు రద్దు అయ్యాయి. కాగా, ఫిబ్రవరి 5,9 తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు(07219) ఆదివారం(మార్చి5,2023) ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి దానాపూర్ కు బయలుదేరుతుంది.
మళ్లీ అదే రైలు గురువారం(మార్చి9,2023)న రాత్రి 8.50 గంటలకు దానాపూర్ నుంచి సికింద్రాబాద్ కు బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. అలాగే శుక్రవారం నుంచి 6వ తేదీ వరకు బెంగళూరు విశ్వేశ్వరయ్య స్టేషన్-నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







