భారత దేశవ్యాప్తంగా 240కి పైగా రైళ్లు రద్దు..
- March 03, 2023
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ వివిధ కారణాలతో ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దు చేసింది. మెయింటనెన్స్, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన మరో 87 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వీటిలో కాన్పూర్, అసన్ సోల్, ఢిల్లీ, లక్నో, బోకారో స్టీల్ సిటీ, బక్సర్, అమరావతి, వాద్రా, నాగ్ పూర్, పుణె, పఠాన్ కోట్, మదురై, రామేశ్వరంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు ఉన్నాయి. రైళ్లు రద్దైన నేపథ్యంలో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా రైళ్లలో ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపారు. అయితే తాము వెళ్లాల్సిన రైలు.. రద్దైన వాటి జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నారు.
బుధవారం కూడా అధికారులు దేశవ్యాప్తంగా 250కిపైగా రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు మరో 96 రైళ్లను నిలిపివేశారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 351 రైళ్లు రద్దు అయ్యాయి. కాగా, ఫిబ్రవరి 5,9 తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు(07219) ఆదివారం(మార్చి5,2023) ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి దానాపూర్ కు బయలుదేరుతుంది.
మళ్లీ అదే రైలు గురువారం(మార్చి9,2023)న రాత్రి 8.50 గంటలకు దానాపూర్ నుంచి సికింద్రాబాద్ కు బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. అలాగే శుక్రవారం నుంచి 6వ తేదీ వరకు బెంగళూరు విశ్వేశ్వరయ్య స్టేషన్-నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







