యూఏఈ వ్యోమగామి సుల్తాన్ సహా అంతరిక్ష కేంద్రానికి చేరిన క్రూ-6 సభ్యులు
- March 03, 2023
యూఏఈ: గత 24 గంటల ప్రయాణం అనంతరం యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి తన క్రూ-6 సహచరులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్నారు. రాబోయే ఆరు నెలల పాటు అక్కడే వారు ఉండి పలు పరిశోధనలు చేయనున్నారు. అంతరిక్ష కేంద్రం చేరగానే వ్యోమగాములు తమ ప్రయాణ అనుభవాలను వివరించారు. అయితే, సుల్తాన్ అరబిక్లో మాట్లాడారు. తన కుటుంబానికి, యూఏఈ నాయకత్వం, MBRSC కు ధన్యవాదాలు తెలిపారు. యూఏఈ, అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో చేపట్టనున్న తమ ప్రయోగ ఫలితాలు మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ సరిహద్దులను చెరపడంలో సహాయం చేస్తోందన్నారు. అంతకుముందు క్రూ-6 సభ్యులకు ఐఎస్ఎస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత నాసా మిషన్ కమాండర్ స్టీఫెన్ బోవెన్ కేంద్రంలోకి ప్రవేశించగా.. ఆ తర్వాత నాసా పైలట్ వారెన్ హోబర్గ్, యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి, రోస్కోస్మోస్, కాస్మోనాట్, ఆండ్రీ ఫెడ్యావ్ వరుసగా ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







