యూఏఈ వ్యోమగామి సుల్తాన్ సహా అంతరిక్ష కేంద్రానికి చేరిన క్రూ-6 సభ్యులు
- March 03, 2023యూఏఈ: గత 24 గంటల ప్రయాణం అనంతరం యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి తన క్రూ-6 సహచరులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్నారు. రాబోయే ఆరు నెలల పాటు అక్కడే వారు ఉండి పలు పరిశోధనలు చేయనున్నారు. అంతరిక్ష కేంద్రం చేరగానే వ్యోమగాములు తమ ప్రయాణ అనుభవాలను వివరించారు. అయితే, సుల్తాన్ అరబిక్లో మాట్లాడారు. తన కుటుంబానికి, యూఏఈ నాయకత్వం, MBRSC కు ధన్యవాదాలు తెలిపారు. యూఏఈ, అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో చేపట్టనున్న తమ ప్రయోగ ఫలితాలు మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ సరిహద్దులను చెరపడంలో సహాయం చేస్తోందన్నారు. అంతకుముందు క్రూ-6 సభ్యులకు ఐఎస్ఎస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత నాసా మిషన్ కమాండర్ స్టీఫెన్ బోవెన్ కేంద్రంలోకి ప్రవేశించగా.. ఆ తర్వాత నాసా పైలట్ వారెన్ హోబర్గ్, యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి, రోస్కోస్మోస్, కాస్మోనాట్, ఆండ్రీ ఫెడ్యావ్ వరుసగా ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు