యూఏఈ వ్యోమగామి సుల్తాన్ సహా అంతరిక్ష కేంద్రానికి చేరిన క్రూ-6 సభ్యులు
- March 03, 2023
యూఏఈ: గత 24 గంటల ప్రయాణం అనంతరం యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి తన క్రూ-6 సహచరులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్నారు. రాబోయే ఆరు నెలల పాటు అక్కడే వారు ఉండి పలు పరిశోధనలు చేయనున్నారు. అంతరిక్ష కేంద్రం చేరగానే వ్యోమగాములు తమ ప్రయాణ అనుభవాలను వివరించారు. అయితే, సుల్తాన్ అరబిక్లో మాట్లాడారు. తన కుటుంబానికి, యూఏఈ నాయకత్వం, MBRSC కు ధన్యవాదాలు తెలిపారు. యూఏఈ, అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో చేపట్టనున్న తమ ప్రయోగ ఫలితాలు మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ సరిహద్దులను చెరపడంలో సహాయం చేస్తోందన్నారు. అంతకుముందు క్రూ-6 సభ్యులకు ఐఎస్ఎస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత నాసా మిషన్ కమాండర్ స్టీఫెన్ బోవెన్ కేంద్రంలోకి ప్రవేశించగా.. ఆ తర్వాత నాసా పైలట్ వారెన్ హోబర్గ్, యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి, రోస్కోస్మోస్, కాస్మోనాట్, ఆండ్రీ ఫెడ్యావ్ వరుసగా ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







