సౌదీ అరేబియాలో తెలుగు నర్స్కు డైసీ అవార్డు
- March 03, 2023
జెడ్డా: రియాద్లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీ(KFMC)లో ఎమర్జెన్సీ విభాగంలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న లక్ష్మి రాచమల్లుకి గ్లోబల్ నర్సింగ్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డైసీ అవార్డు లభించింది. డైసీ (DAISY-డిసీజెస్ అటాకింగ్ ది ఇమ్యూన్ సిస్టం) అవార్డ్ 33 దేశాల్లో గుర్తింపు పొందిన అంతర్జాతీయ అవార్డు. దీనిని విధినిర్వహణలో నైపుణ్యం, మానవత సేవలు చేసే నర్సులను గుర్తించి అందజేస్తారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఉన్న KFMC 1200 పడకల ఆస్పత్రి. సంవత్సరానికి 500,000 మంది ఔట్ పేషెంట్లకు సేవలు అందిస్తుంది. కొవిడ్-19 సంక్షోభ సమయంలో 33 రోజులు ICUలో గడిపిన కెనడియన్ రోగికి లక్ష్మి మెరుగైన సంరక్షణను అందించింది. ఈ సేవలను గుర్తించి యాజమాన్యం ఆమె పేరును డైసీ అవార్డుకు సిఫార్సు చేసింది. కడప జిల్లాకు చెందిన లక్ష్మి గత 17 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో ఉంటున్నారు. దానికంటే ముందు ఆమె హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో పనిచేశారు. అమెరికాకు చెందిన తన బంధువులతో కలిసి పేదలకు సేవ చేసేందుకు తన స్వగ్రామంలో స్వచ్ఛంద ఆసుపత్రిని స్థాపించాలని యోచిస్తోన్నట్లు లక్ష్మి వెల్లడించారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







