రోడ్ల మధ్యలో వాహనం ఆపితే.. Dh1,000 జరిమానా
- March 04, 2023
యూఏఈ: రహదారి మధ్యలో తమ వాహనాలను ఆపడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, ఇతర రహదారి వినియోగదారులకు ప్రమాదం కలిగించడం లాంటి చర్యలు మానుకోవాలని అబుధాబి పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఆపడం వల్ల కలిగే ప్రమాదాలపై పోలీసులు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఓ వీడియోను పంచుకున్నారు. వీడియోలో రద్దీగా ఉండే హైవేపై వీల్ కవర్ కనిపించడంతో ఓ వ్యాన్ డ్రైవర్ తన వాహనాన్ని రోడ్డు మధ్యలో ఆపేశాడు. దీంతో వెనకాల వస్తున్న ఇతర వాహనాల డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు. మరో సంఘటనలో వ్యాన్ వెనుక ఉన్న కారు సమయానికి ఆపడంలో విఫలమై వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. అనేక వాహనాలు వ్యాన్ను ఢీకొనకుండా జాగ్రత్త పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్లపై సురక్షితంగా ప్రయాణించే లక్ష్యంతో 'యు కామెంట్' కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఈ వీడియో క్లిప్ను విడుదల చేశారు. అకస్మాత్తుగా వాహనాలను ఆపినపుడు సమీపంలోని ఎగ్జిట్కు వెళ్లాలని లేదా కనీసం రహదారికి కుడి వైపునకు వెళ్లాలని ట్రాఫిక్ అధికారులు వాహనదారులకు గుర్తు చేశారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపే డ్రైవర్లకు Dh1,000 జరిమానాతోపాటు ఆరు ట్రాఫిక్ బ్లాక్ పాయింట్లు విధిస్తామని అబుధాబి పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







