దుబాయ్, అబుధాబిలో దట్టమైన పొగమంచు. రెడ్, ఎల్లో అలర్ట్ జారీ
- March 04, 2023
యూఏఈ: దుబాయ్, అబుధాబిలో దట్టమైన పొగమంచు కారణంగా యూఏఈ వాతావరణ విభాగం రెడ్, ఎల్లో అలర్ట్లను జారీ చేసింది. శనివారం ఉదయం భారీ పొగమంచు ఏర్పడుతుందని నివాసితులను హెచ్చరించింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) ప్రకారం.. దృశ్యమానత 1,000మీ కంటే తక్కువగా పడిపోతుంది. ఇది కొన్ని తీరప్రాంత, అంతర్గత ప్రాంతాలలో అధిక ప్రభావం ఉండనుంది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్ వైపు ఎమిరేట్స్ రోడ్డు మీద పొగమంచు కమ్మే అవకాశం ఉందని MET విభాగం అంచనా వేసింది. వాహనదారులు జాగ్రత్తగా నడపాలని, కొన్ని ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ సమాచార బోర్డులపై ప్రదర్శించబడే వేగ పరిమితులను పాటించాలని సూచించింది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం షార్జాలో వర్షం, వడగళ్ల వాన కురిసింది. మలేహా, హమ్దా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షాలు, వడగళ్ళు కురిశాయి. అలాగే ఖోర్ ఫక్కన్, అల్ దైద్ రోడ్, విషా, కొన్ని ఇతర తూర్పు ప్రాంతాలలో కూడా వర్షాలు కురిశాయి.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







