సీబ్ బీచ్లో మునిగిన 9 ఏళ్ల బాలుడు
- March 04, 2023
మస్కట్: సీబ్ బీచ్లో శుక్రవారం విషాదకర ఘటన జరిగింది. ఓ 9 ఏళ్ల బాలుడు నీటిలో మునిగి మృతిచెందాడు. మస్కట్ గవర్నరేట్లోని సీబ్ బీచ్లో మధ్యాహ్నం 1:35 గంటలకు ఒక చిన్నారి మునిగిపోయిన సంఘటన గురించి తమకు సమాచారం అందిందని విలాయత్ ఆఫ్ సీబ్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీకి చెందిన ఒక అధికారి తెలిపారు. రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు సంఘటన స్థలానికి వెళ్లాయని, పిల్లవాడిని సముద్రం నుండి బయటకు తీయగా.. అప్పటికే బాలుడు చనిపోయాడని తెలిపారు. తొమ్మిదేళ్ల బాలుడు తన తండ్రితో కలిసి బీచ్ లో ఈత కొడుతున్నాడని అధికారి చెప్పారు. బలమైన ప్రవాహం కారణంగా బాలుడు సముద్రంలో మునిగి చనిపోయాడని వెల్లడించారు. బీచ్కి వెళ్లే వారందరూ నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే ఈత కొట్టాలని, పిల్లలు ఈత కొట్టేటప్పుడు పెద్దలు పర్యవేక్షించాలని, ఒంటరిగా ఉండకూడదని, బీచ్ సమీపంలో ఆడుతున్నప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు పర్యవేక్షించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







