ఒమన్లో భారతీయ ప్రయాణికుల కొత్త రికార్డు
- March 04, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం.. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎక్కువగా ఉపయోగించే ప్రయాణీకుల జాబితాలో భారతీయ ప్రయాణికులు అగ్రస్థానంలో ఉన్నారు. నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2022 చివరి నాటికి 147,000 కంటే ఎక్కువ మంది భారతీయ ప్రయాణికులు మస్కట్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. భారత్ తర్వాత స్థానాల్లో 53,130 మంది ప్రయాణికులతో బంగ్లాదేశ్, 39,853 మంది ప్రయాణికులతో పాకిస్తాన్ లు ఉన్నాయి.
మస్కట్, సలాలా, సోహార్ విమానాశ్రయాల ద్వారా వచ్చివెళ్లిన అంతర్జాతీయ విమానాల సంఖ్య 128 శాతం పెరిగింది. డిసెంబర్ 2022 చివరి నాటికి 65,220 విమానాల మార్కును దాటింది. 2021లో ఇదే కాలానికి ఇది 28,580 విమాన సర్వీసులుగా ఉంది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా వచ్చేవారి సంఖ్య గణనీయంగా 133 శాతం పెరిగింది. అలాగే డిపార్చర్ల సంఖ్య కూడా గత డిసెంబర్ చివరి వరకు 109 శాతం పెరిగింది.
డిసెంబర్ 2022 చివరి నాటికి మస్కట్, సలాలా, సోహర్, దుక్మ్ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించిన ప్రయాణీకుల మొత్తం సంఖ్య 9,876,762కి చేరుకుంది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణం సాగించే అంతర్జాతీయ, దేశీయ విమానాల సంఖ్య 107 శాతం పెరిగంది. 68,737 విమాన సర్వీసులు ద్వారా 8,602,791 మంది ప్రయాణీకులు ప్రయాణించారు.
సలాలా విమానాశ్రయం అంతర్జాతీయ, దేశీయ విమానాల సంఖ్యలో 71 శాతం గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. విమానాశ్రయం ద్వారా 1,128,024 మంది ప్రయాణీకులు 8,672 విమానాల ద్వారా రాకపోకలు సాగించారు. సోహార్ విమానాశ్రయం నుండి వెళ్లివచ్చే అంతర్జాతీయ, దేశీయ విమానాల సంఖ్య విషయానికొస్తే.. డిసెంబర్ 2022 చివరి వరకు 813 విమానాల ద్వారా 78,482 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2022 చివరి వరకు దుక్మ్ విమానాశ్రయం 650 విమాన సర్వీసులతో 67,465 మంది ప్రయాణికులు ప్రయాణించారు.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







