సానియా మీర్జాకు గ్రాండ్ ఫేర్వెల్
- March 05, 2023
హైదరాబాద్: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు గ్రాండ్ ఫేర్వెల్ లభించింది. ఇప్పటికే టెన్నిస్కు వీడ్కోలు పలికిన సానియా.. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్ ఆడింది. డబుల్స్ మ్యాచ్ సానియా, బోపన్న- ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరిగింది. సింగిల్స్లో రోహన్ బోపన్నతో సానియా తలపడింది. సానియా చివరి మ్యాచ్ను వీక్షించేందుకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్సింగ్, అజారుద్దీన్ తదితరులు సానియా చివరి మ్యాచ్ను వీక్షించారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఎల్బీ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం సానియా మీర్జాకు ఓ ప్రైవేట్ హోటల్లో రెడ్ కార్పెట్ ఈవెంట్, గాలా డిన్నర్ జరగనుంది. సాయంత్రం గాలా డిన్నర్కు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, సినీ, క్రీడా ప్రముఖులు మహేశ్బాబు, ఏఆర్ రెహమాన్, సురేష్రైనా, జహీర్ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









