స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు...
- March 05, 2023
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ , ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
షార్ట్లిస్టింగ్ కమ్ ఇంటరాక్షన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారు ముంబయి, ఎస్బీఐఎల్, కోల్కతాలో పనిచేయవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో మార్చి 15, 2023వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/పరిశీలించగలరు.
తాజా వార్తలు
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం









