అక్రమ వలసదారులను అడ్డుకుంటాం: బ్రిటన్ ప్రధాని రిషి సునక్
- March 06, 2023
లండన్: అక్రమ వలసదారులను అడ్డుకుంటామని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ హెచ్చరించారు. అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించే వలసదారులను బహిష్కరిస్తామని, వారు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించబోమని హెచ్చరించారు. అక్రమంగా ప్రవేశించడం చేయవద్దని.. అలాంటి తప్పులు చేయవద్దని వలసదారులకు సూచించారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. యూరప్నుండి వలసదారుల ప్రవాహం అధికంగా ఉందని అన్నారు. ఇంగ్లీష్ చానెల్ ద్వారా పడవల్లో దేశంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులపై ప్రత్యేక దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. అక్రమ వలసదారుల భారం బ్రిటీష్ ప్రజలపై పడుతుందని, ఈ వలసలు న్యాయం కాదని అన్నారు. నేరపూరితమైన, అనైతిక వ్యాపారాన్ని కొనసాగించదం కూడా సరికాదని హెచ్చరించారు. పడవలను అడ్డుకుంటామని తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని అన్నారు. ఫ్రాన్స్ నుండి ప్రమాదకర ప్రయాణాల ద్వారా బ్రిటన్లోకి ప్రవేశిస్తున్న శరణార్థుల సంఖ్య పెరగడాన్ని పరిష్కరించడానికి కూడా బ్రిటన్ యత్నిస్తోంది.
అక్రమ వలసలపై ఈ వారం చిరవలో కఠిన చట్టాన్ని తీసుకురావాలని సునక్ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా తెలిపింది. ఈ కొత్త చట్టం చిన్న పడవలో వచ్చే వలసదారులను అడ్డుకుని, తిరిగి బ్రిటన్కు రాకుండా శాశ్వతంగా నిషేధించే బాధ్యతను హోంసెక్రటరీకి అప్పగించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









