‘క్రౌన్ ప్రిన్స్’కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి
- March 08, 2023
కువైట్: కువైట్లో కొత్తగా నియమితులైన భారత రాయబారి హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ డిప్యూటీ అమీర్, క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు తన ఆధారాలను(క్రెడెన్షియల్స్) సమర్పించారు. రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా బయాన్ ప్యాలెస్లోని క్రౌన్ ప్రిన్స్ హెచ్హెచ్ని కలిశారు. ఈ సందర్భంగా భారత్-కువైట్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను మరింతముందుకు తీసుకుపోయేందుకు కృషి చేయాలని భారత రాయబారికి , క్రౌన్ ప్రిన్స్ సూచించారు. "భారతదేశం - కువైట్ సాంప్రదాయ భాగస్వాములు. బలమైన చారిత్రక పునాదులపై ఇరు దేశాల మైత్రి నెలకొన్నది. అంబాసిడర్గా ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలను కొనసాగిస్తా. " అని రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా చెప్పారు.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







