‘క్రౌన్ ప్రిన్స్’కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి
- March 08, 2023
కువైట్: కువైట్లో కొత్తగా నియమితులైన భారత రాయబారి హిస్ ఎక్సెలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ డిప్యూటీ అమీర్, క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు తన ఆధారాలను(క్రెడెన్షియల్స్) సమర్పించారు. రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా బయాన్ ప్యాలెస్లోని క్రౌన్ ప్రిన్స్ హెచ్హెచ్ని కలిశారు. ఈ సందర్భంగా భారత్-కువైట్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించారు. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను మరింతముందుకు తీసుకుపోయేందుకు కృషి చేయాలని భారత రాయబారికి , క్రౌన్ ప్రిన్స్ సూచించారు. "భారతదేశం - కువైట్ సాంప్రదాయ భాగస్వాములు. బలమైన చారిత్రక పునాదులపై ఇరు దేశాల మైత్రి నెలకొన్నది. అంబాసిడర్గా ఉన్నత స్థాయి దౌత్య సంబంధాలను కొనసాగిస్తా. " అని రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









