సౌదీలో మెట్రో రైళ్లు నడుపుతోన్న హైదరాబాదీ మహిళ
- March 08, 2023
జెడ్డా: ప్రపంచంలో మహిళలు వాహనాలు నడపడానికి అనుమతించని ఏకైక దేశం సౌదీ అరేబియా. అయితే, సౌదీ అరేబియాలో విజన్ 2030లో భాగంగా మహిళలు ఇప్పుడు మహిళా సాధికారతతో సంప్రదాయ పద్ధతులను విడనాడుతూ అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో భారతీయ మహిళా లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి కూడా ఒకరిగా గుర్తింపు పొందారు.
హైదరాబాద్లో స్థిరపడిన గుంటూరుకు చెందిన ఆమె ఇప్పుడు రియాద్ మెట్రో రైలులో పైలట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. సౌదీ అరేబియాలో రైళ్లను నడపడానికి ముందు, ఇందిర హైదరాబాద్ మెట్రో రైలులో మూడేళ్లపాటు పనిచేశారు. ఇప్పటివరకు మెట్రో రైళ్లను 15 వేల కిలోమీటర్లు నడిపిన ఘనత ఆమె సొంతం. ఐటిలో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఇందిరా.. తన స్నేహితులు సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకున్నప్పుడు భిన్నంగా ఉండాలని లోకో పైలట్గా మారాలని నిర్ణయించుకున్నారు.
"నేను చిన్నతనంలో మెకానిక్ అయిన తన తండ్రికి పనిముట్లు, విడిభాగాలను ఇచ్చి సహాయం చేసేదానిని. ఇప్పుడు నేను ప్రపంచంలోని అత్యంత అధునాతన రైళ్లను నడుపుతున్నాను" అని ఇందిర సంతోషం వ్యక్తం చేశారు. "మేము ముగ్గురు సోదరీమణులం. మా నాన్న మా చదువుకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. అయినప్పటికీ మా బంధువులు కొందరు కట్నం కోసం పొదుపు చేయకుండా విద్యపై ఖర్చు చేయడాన్ని వ్యతిరేకించారు." అని ఆమె గుర్తుచేసుకున్నారు.
“నేను రియాద్ మెట్రోకు ఎంపికైనప్పుడు, మా బంధువుల్లో చాలా మంది ఒంటరి మహిళ రైలు పైలట్గా పనిచేయడానికి సౌదీ అరేబియాకు ఎలా వెళ్లగలదో అని భయపడ్డారు. నా సంకల్పం నన్ను అడ్డుకోలేదు. ”అని ఇందిర చెప్పారు. ఫుట్బాల్ ప్రపంచకప్ సమయంలో ఇందిర దోహాలో మెట్రో రైళ్లను నడిపి ప్రశంసలు అందుకుంది. ఇందిర భర్త కూడా ఖతార్లో లోకో పైలట్గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









