రాయుడు పాటలు 11న విడుదల..
- May 05, 2016
విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని 'రాయుడు' పేరుతో హరి వేంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ఇటీవలే గ్లామర్ హీరోయిన్స్ శ్రుతిహాసన్, తమన్నా, రకుల్ప్రీత్సింగ్ విడుదల చేశారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా గురించి విశాల్ మాట్లాడుతూ, పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నా కెరీర్లో మరో విభిన్నమైన సినిమాగా నిలుస్తుందని, ముత్తయ్య అద్భుతంగా తెరకెక్కించాడని, ఆలాగే నా గెటప్ కూడా కొత్తగా వుంటుందని అన్నారు. అన్నిరకాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఇందులో వుంటాయని అన్నారు. నిర్మాత హరి మాట్లాడుతూ, ముగ్గురు టాప్ హీరోయిన్లు ఈ సినిమా టీజర్ను సోషల్ మీడియాలో విడుదలచేయడం ఆనందంగా వుందని, ఇటీవలే విడుదలైన ఫస్ట్లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







