18 ఏళ్ల తర్వాత స్వదేశానికి డొంగ కనమ్మ
- March 11, 2023
బహ్రెయిన్:డొంగ కనమ్మ (60) ఆంధ్రప్రదేశ్ నుండి 18 సంవత్సరాల క్రితం బహ్రెయిన్కు చేరుకున్నారు.ఆమె వద్ద గత 18 సంవత్సరాలుగా ఎటువంటి ప్రయాణ పత్రాలు కూడా లేవు. భారత రాయబార కార్యాలయం సహాయంతో గత సెప్టెంబరులో భారత ప్రభుత్వ అధికారుల నుండి అందుబాటులో ఉన్న పత్రాలతో EC జారీ చేశారు.అంతకు ముందు ఆమె ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ను క్లియర్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి.కానీ దురదృష్టవశాత్తు రుజువు పత్రాలు లేకపోవడం, సిస్టమ్లో వివరాలు లేకపోవడం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. రెండు వారాల క్రితం ప్రవాసీ లీగల్ సెల్ కంట్రీ హెడ్ సుధీర్ తిరునిలత్ మళ్లీ ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించారు. ఆమె పరిస్థితిని, వైద్య పరిస్థితులను అధికారులకు వివరించారు. దీంతో సమస్య పరిష్కారం అయి భారత రాయబార కార్యాలయం టిక్కెట్ను అందించింది. డొంగ కానమ్మ ఫ్లై దుబాయ్ విమానంలో హైదరాబాద్కు తిరిగి వెళ్లారు. గత ఏడాది జరిగిన ఇండియన్ ఎంబసీ టీకా డ్రైవ్లో ఆమెను గుర్తించిన ఇండియన్ క్లబ్ వీపీ సానిపాల్ సహాయాన్ని అందించారు.ఆమెకు నివాస సదుపాయంతో పాటు ఆహారం అవసరమైన అన్ని ఇతర మద్దతును అందచేశారు. ఈ సందర్భంగా తనకు సహాయం చేసిన బహ్రెయిన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, భారత రాయబార కార్యాలయం బహ్రెయిన్ అధికారులు, AP రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సానిపాల్, ది ఇండియన్ క్లబ్ హెల్ప్ డెస్క్ టీమ్, ప్రవాసీ లీగల్ సెల్, వరల్డ్ NRI వారందరికీ డొంగ ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







