రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం..
- March 10, 2023
అమరావతి: 222వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో గతేడాది రుణ ప్రణాళిక లక్ష్యాలు-సాధన పై ఎస్ ఎల్ బీసీ వివరాలు అందించింది.ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించిందన్నారు సీఎం. ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉందన్నారు. కొన్ని రంగాలకు సంబంధించి పనితీరు చాలా బాగుందని అయితే మరికొన్ని కీలక రంగాలకు మరింత ప్రోత్సాహం అవసరం అన్నారు సీఎ జగన్. విద్యారంగానికి కేవలం 42.91శాతం, గృహనిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చాయని… సామాజిక,ఆర్థిక ప్రగతిలో ఈ రెండు రంగాలు అత్యంత కీలకమని ఈ రెండు రంగాల పట్ల మరింత సానుకూల దృక్పథంతో బ్యాంకులు ముందడుగు వేయాలని ఆయన కోరారు. వ్యవసాయ రంగంలో 83.36శాతం మాత్రమే లక్ష్యం చేరుకున్నారని ఈ రంగంపై ఎస్ ఎల్ బీసీ దృష్టి సారించాలన్నారు.
కౌలు రైతులకు రుణాలకు సంబంధించి డిసెంబర్ 2022 వరకు కేవలం 49.37% మాత్రమే వార్షిక లక్ష్యాన్ని సాధించినట్లు సీఎం చెప్పారు..డ్వాక్రా గ్రూపులకు ఇచ్చే రుణాలపై వడ్డీల విషయంలో బ్యాంకులు మరోసారి ఆలోచన చేయాలని ఆయన కోరారు…నాబార్డు, బ్యాంకులు డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపైనా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు..MSME లపై బ్యాంకింగ్ రంగం మరింత శ్రద్ధ వహించాలని సీఎం బ్యాంకర్లను కోరారు.
ద్వారా దాదాపు 13లక్షల కోట్లపెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు సీఎం . ఈ పెట్టుబడులు పెట్టేందుకు రుణాల లభ్యత చాలా ముఖ్యమైనదని…అనుబంధ యూనిట్లకు అవసరమైన మద్దతును కూడా బ్యాంకింగ్ రంగం అందించాలని సీఎం కోరారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







