ధర స్థిరంగా...

- May 05, 2016 , by Maagulf
ధర స్థిరంగా...

కొనుగోళ్లు మందకొడిగా సాగడంతో బంగారం ధర గురువారం స్థిరంగా ఉంది. బుధవారం నాటి ధర రూ.30,100 వద్దే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగినప్పటికీ దేశీయంగా కీలక సమయాల్లో కొనుగోళ్లు జరగకపోవడంతో దీని ధర స్థిరంగా ఉందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.3 శాతం పెరిగి 1,283.44 అమెరికన్‌ డాలర్లకు చేరింది.గురువారం వెండి ధర పెరిగింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.4శాతం పెరిగి 17.41 యూఎస్‌ డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com