ధర స్థిరంగా...
- May 05, 2016
కొనుగోళ్లు మందకొడిగా సాగడంతో బంగారం ధర గురువారం స్థిరంగా ఉంది. బుధవారం నాటి ధర రూ.30,100 వద్దే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగినప్పటికీ దేశీయంగా కీలక సమయాల్లో కొనుగోళ్లు జరగకపోవడంతో దీని ధర స్థిరంగా ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.3 శాతం పెరిగి 1,283.44 అమెరికన్ డాలర్లకు చేరింది.గురువారం వెండి ధర పెరిగింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.4శాతం పెరిగి 17.41 యూఎస్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట









