ధర స్థిరంగా...
- May 05, 2016
కొనుగోళ్లు మందకొడిగా సాగడంతో బంగారం ధర గురువారం స్థిరంగా ఉంది. బుధవారం నాటి ధర రూ.30,100 వద్దే కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగినప్పటికీ దేశీయంగా కీలక సమయాల్లో కొనుగోళ్లు జరగకపోవడంతో దీని ధర స్థిరంగా ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.3 శాతం పెరిగి 1,283.44 అమెరికన్ డాలర్లకు చేరింది.గురువారం వెండి ధర పెరిగింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం తదితర కారణాల వల్ల దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.4శాతం పెరిగి 17.41 యూఎస్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









