తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్..
- March 14, 2023
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చారు. విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ ప్రత్యేక యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ ను సులువుగా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ లోకేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా సులువుగా సమయానికి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవచ్చు.
బుధవారం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవ్సతరం పరీక్షలు, గురువారం నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ రెండో సంవ్సతరం పరీక్షలు ప్రారంభం అవుతాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న పరీక్షలకు అధికారుులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4,82,677 మంది ఫస్టియర్ విద్యార్థులు కాగా, 4,65,022 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్ధం రెండు కంట్రోల్ రూమ్ నెంబర్లు 040-24601010, 040-24644027ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే నిమిషం నిబంధన ఉంటుందని, ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









