తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్..
- March 14, 2023
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చారు. విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ ప్రత్యేక యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ ను సులువుగా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ లోకేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా సులువుగా సమయానికి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవచ్చు.
బుధవారం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవ్సతరం పరీక్షలు, గురువారం నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ రెండో సంవ్సతరం పరీక్షలు ప్రారంభం అవుతాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న పరీక్షలకు అధికారుులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4,82,677 మంది ఫస్టియర్ విద్యార్థులు కాగా, 4,65,022 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్ధం రెండు కంట్రోల్ రూమ్ నెంబర్లు 040-24601010, 040-24644027ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే నిమిషం నిబంధన ఉంటుందని, ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







