తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్..
- March 14, 2023
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చారు. విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ ప్రత్యేక యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ ను సులువుగా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ లోకేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో ఎలాంటి టెన్షన్ లేకుండా సులువుగా సమయానికి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవచ్చు.
బుధవారం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవ్సతరం పరీక్షలు, గురువారం నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ రెండో సంవ్సతరం పరీక్షలు ప్రారంభం అవుతాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న పరీక్షలకు అధికారుులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4,82,677 మంది ఫస్టియర్ విద్యార్థులు కాగా, 4,65,022 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల పాటు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్ధం రెండు కంట్రోల్ రూమ్ నెంబర్లు 040-24601010, 040-24644027ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే నిమిషం నిబంధన ఉంటుందని, ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!









