2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వేగా ‘భారతీయ రైల్వే’
- March 14, 2023
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద "గ్రీన్ రైల్వే నెట్వర్క్" కలిగి ఉన్న స్థితిని చేరుకుంటుంది. భారతీయ రైల్వే తన నెట్వర్క్లో 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఏడేళ్లలో "నెట్-జీరో కార్బన్ ఎమిటర్" అవుతుందని భారత రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు వ్యవస్థ విద్యుదీకరణను పూర్తి చేసినట్లు ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వే ఉత్తరాఖండ్లోని తమ నెట్వర్క్ను విద్యుదీకరించడం అంతర్జాతీయ, దేశీయ పర్యాటకులకు రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ప్రసిద్ధ టైగర్ రిజర్వ్, హిల్ స్టేషన్ ముస్సోరీ వంటి అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించే పర్యాటక ఆకర్షణలు ఈ రాష్ట్ర రైలు నెట్వర్క్ పరిధిలోకి వస్తాయి. ఉత్తరాఖండ్ రైలు వ్యవస్థ 1884 నుండి ఉనికిలో ఉంది. ఉత్తర, ఈశాన్య రైల్వే పరిధిలో నిర్మించనున్న అన్ని కొత్త రైలు మార్గాలను పూర్తిగా విద్యుదీకరించనున్నట్లు ఓ ప్రకటనలో భారత రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







