మళ్లీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు..
- March 16, 2023
న్యూ ఢిల్లీ: కోవిడ్ కేసులు పెరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. టెస్టింగ్, వ్యాక్సినేషన్, చికిత్స, ట్రాకింగ్ వంటివి వేగంగా నిర్వహించాలని సూచించింది. కోవిడ్ వ్యాప్తి అరికట్టేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఇటీవలి కాలంలో ఒక్క రోజులోనే 700కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై కేంద్రం ఆందోళనవ్యక్తం చేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,623కు చేరింది. గత నవంబర్ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. నాలుగు నెలల తర్వాత మళ్లీ కేసులు పెరిగాయి. చివరగా గత నవంబర్ 12న 734 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
ప్రస్తుతం కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. జిల్లా స్థాయిలోనూ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం కేసుల శాతం 0.01గా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.80గా ఉంది. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.19గా ఉంది. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297గా ఉంది. దేశంలో మొత్తం 220.64 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







