కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- June 22, 2026
కువైట్: కువైట్ లో బంగారం, విలువైన రాళ్లు మరియు విలువైన లోహాల రంగాల నియంత్రణకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త సవరణలను ప్రవేశపెట్టింది. ఈ పరిశ్రమల్లోని లావాదేవీలపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది.
సవరించిన కొత్త రూల్స్ ప్రకారం.. యాజమాన్య బదిలీ లేదా బంగారం అమ్మకం లేని సందర్భాలలో గోల్డ్ షాపులు, వర్క్షాప్ల మధ్య బంగారం సరఫరా ఎక్ఛేంజ్ కు గతంలో అనుమతించిన నిబంధనను మంత్రిత్వ శాఖ తొలగించింది.
అలాగే, యాజమాన్య బదిలీ ద్వారా వినియోగదారులు మరియు లైసెన్స్ పొందిన బంగారం, విలువైన రాళ్లు మరియు విలువైన లోహాల వ్యాపారుల మధ్య బంగారంపై లావాదేవీలను నిషేధించారు. వినియోగదారుడు పాత బంగారాన్ని మార్చుకోవడానికి, దుకాణాలు పాత బంగారం కొనుగోలు విలువను వినియోగదారుడి ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కస్టమర్ తన బ్యాంకు అకౌంట్ నుండి కొత్త బంగారాన్ని కొనుగోలు చేసి మొత్తం మొత్తాన్ని చెల్లించాలి. వీటిని రెండు వేర్వేరు లావాదేవీలుగా పరిగణిస్తారు. లావాదేవీ తేదీ, బంగారం బరువు, స్వచ్ఛత (క్యారెట్) మరియు విలువతో సహా అన్ని వివరాలు పూర్తిగా నమోదు చేయాల్సిందేనని మంత్రిత్వశాఖ తన గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది.
ఇప్పటికే ఈ రంగంలో ఉన్న మనీలాండరింగ్ నిరోధక మరియు పారదర్శకత చర్యలకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. వీటిలో భాగంగా నగదు లావాదేవీలపై నిషేధం, ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ప్రోత్సాహించడం, KD 3,000 మించిన లావాదేవీల కోసం కస్టమర్ గుర్తింపు వివరాలను సేకరించడం వంటివి ఉన్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







