ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
- March 17, 2023
న్యూ ఢిల్లీ: సీఎం జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. మధ్యాహ్నం ప్రధాని మోడీ , కేంద్ర మంత్రి అమిత్ షా లతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది.
స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుందని సీఎం జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారు. అరగంటకు పైగా సాగిన సమావేశంలో ప్రధానంగా 14 అంశాలను జగన్ ప్రస్తావించారు. అలాగే పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ మేరకు సీఎం వినతి పత్రం అందించారు.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి









