ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
- March 17, 2023
న్యూ ఢిల్లీ: సీఎం జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. మధ్యాహ్నం ప్రధాని మోడీ , కేంద్ర మంత్రి అమిత్ షా లతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది.
స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుందని సీఎం జగన్ ప్రధాని దృష్టికి తెచ్చారు. అరగంటకు పైగా సాగిన సమావేశంలో ప్రధానంగా 14 అంశాలను జగన్ ప్రస్తావించారు. అలాగే పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ మేరకు సీఎం వినతి పత్రం అందించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్









