బహ్రెయిన్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్
- March 19, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు యూరోపియన్ జాతీయులు, ఒక జీసీసీ జాతీయుడు, ఒక అరబ్ మహిళ, ముగ్గురు బహ్రెయిన్లు ఉన్నారు. వీరికి సంబంధించిన కేసులో తుది వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. నేరారోపణలు నిరూపణ అయితే వీరికి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్షలు పడే అవకాశం ఉంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఓ పోలీసు అధికారి డ్రగ్స్ కావాలంటూ ముఠా సభ్యుడిని ఆశ్రయించాడు. బీడీ 120 విలువైన కొకైన్ను కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఫ్ జిల్లాలో ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి చేరుకున్న ముఠా సభ్యుడు.. డ్రగ్స్ను అందజేయగానే పోలీసు అధికారులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటి BD8,000 నగదుతో సహా భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంలో ముఠాలోని మిగతా సభ్యులను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..









