బహ్రెయిన్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్
- March 19, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు యూరోపియన్ జాతీయులు, ఒక జీసీసీ జాతీయుడు, ఒక అరబ్ మహిళ, ముగ్గురు బహ్రెయిన్లు ఉన్నారు. వీరికి సంబంధించిన కేసులో తుది వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. నేరారోపణలు నిరూపణ అయితే వీరికి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్షలు పడే అవకాశం ఉంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఓ పోలీసు అధికారి డ్రగ్స్ కావాలంటూ ముఠా సభ్యుడిని ఆశ్రయించాడు. బీడీ 120 విలువైన కొకైన్ను కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఫ్ జిల్లాలో ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి చేరుకున్న ముఠా సభ్యుడు.. డ్రగ్స్ను అందజేయగానే పోలీసు అధికారులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటి BD8,000 నగదుతో సహా భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంలో ముఠాలోని మిగతా సభ్యులను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







