ఇంటర్నెట్ వినియోగదారుల్లో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ..
- March 20, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారుల్లో (వైర్లెస్, వైర్ కనెక్షన్) తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.మొదటి స్థానాన్ని కేరళ సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే వంద మందిలో 80మందికిపైగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారు ఉన్నారు. వీటిలో కేరళ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో తెలంగాణ, మూడు, నాలుగు స్థానాల్లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
దేశంలో వంద మందిలో 67 మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉందని తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇక తెలంగాణకు పోరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఆ రాష్ట్రంలో వంద మందిలో 67 మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. చివరి స్థానంలో బీహార్ రాష్ట్రం నిలిచింది. ఆ రాష్ట్రంలో వంద మందికి కేవలం 37 మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఢిల్లీని రాష్ట్రంగా కాకుండా ఒక నగరంగా పరిగణలోకి తీసుకున్నారు. ఇక్కడ ప్రతీ 100 మందికి 202 ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.
నివేదిక ప్రకారం.. తెలంగాణలో 11.5 మిలియన్ల గ్రామీణ సబ్ స్క్రైబర్లు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో వారి సంఖ్య 20 మిలియన్లు. పట్టణ ప్రాంతాలు 100 జనాభాకు 110 ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నారు. ఇందుకు కారణం.. రాష్ట్రంలో మొబైల్ నెట్వర్క్ టవర్ల నిర్మాణంకు అనుమతులు వేగంగా మంజూరు చేయడం ద్వారా ఇంటర్నెట్ సౌలభ్యం ఎక్కువ ప్రాంతాల వారికి అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు తమ సొంత అవసరాలకోసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లను కలిగి ఉండటంలో దేశంలోని మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







