విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత..
- March 20, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచాణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకుని లోపలికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లడం గమనార్హం. అలాగే, వారితో న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. అరుణ్ పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవిత విచారణకు హాజరవుతారని ఇవాళ ఉదయం బీఆర్ఎస్ వర్గాలు కూడా తెలిపాయి.
ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, సుప్రీంకోర్టులో కేసు కారణంగా విచారణకు రాలేనని తెలిపిన విషయం తెలిసిందే. ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ విచారణ అనంతరమే హాజరవుతానని అన్నారు. అయితే, అదే రోజు కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపింది.
దీంతో ఇవాళ కవిత విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణలో ఆమె పాల్గొనడం ఇది రెండోసారి. ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె లీగల్ టీమ్ తో మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి ఆమె పలువురితో కలిసి నిన్ననే వెళ్లారు. కవిత ఢిల్లీ, తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో ఉన్నారు. కొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. అలాగే, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలంతా ఢిల్లీలో ఉన్నారు.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేయనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సౌత్ గ్రూప్ నుంచి కవితను కీలక వ్యక్తిగా ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో సౌత్ గ్రూప్ పాత్ర,100 కోట్ల ముడుపుల వ్యవహారాలు, నిందితులతో సంబంధాలు, డీలర్ కమిషన్ పెంచడం, లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా పాలసీలో మార్పులపై ఢిల్లీ, హైదరాబాద్ లో జరిగిన సమావేశాలపై కవితను ఈడీ ప్రశ్నించనుంది. ఇప్పటికే బాంక్ స్టేట్ మెంట్స్ సహా ఈడీ అడిగిన 12 డాక్యుమెంట్లను కవిత అందజేశారు. లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదని.. ఎవరో ఇచ్చిన స్టేట్ మెంట్స్ ద్వారా తనను ఇరికిస్తున్నారని కవిత అంటున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







