సిబ్బందికి ఉచితంగా కంటి వెలుగు పరీక్షలు ప్రారంభించిన రాచకొండ కమిషనర్ చౌహాన్
- March 29, 2023
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి మరియు కమీషనరేట్ ఆఫీసులో పనిచేస్తున్న మినిస్టీరియల్ సిబ్బందికి రాచకొండ పోలీసు భద్రత మరియు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం "కంటి వెలుగు" ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ డి.ఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు అధికారులు మరియు ఇతర సిబ్బంది యొక్క సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కూడా సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, కోవిడ్ సమయంలో కూడా సిబ్బందికి ఉచిత వ్యాక్సిన్ అందించడం జరిగిందని గుర్తు చేశారు.సిబ్బంది సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట మల్కాజిగిరి డీసీపీ జానకి, డీసీపీ అడ్మిన్ ఇందిర, డాక్టర్ అచ్యుత రావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!







