సిబ్బందికి ఉచితంగా కంటి వెలుగు పరీక్షలు ప్రారంభించిన రాచకొండ కమిషనర్ చౌహాన్
- March 29, 2023
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి మరియు కమీషనరేట్ ఆఫీసులో పనిచేస్తున్న మినిస్టీరియల్ సిబ్బందికి రాచకొండ పోలీసు భద్రత మరియు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం "కంటి వెలుగు" ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ డి.ఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు అధికారులు మరియు ఇతర సిబ్బంది యొక్క సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కూడా సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, కోవిడ్ సమయంలో కూడా సిబ్బందికి ఉచిత వ్యాక్సిన్ అందించడం జరిగిందని గుర్తు చేశారు.సిబ్బంది సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట మల్కాజిగిరి డీసీపీ జానకి, డీసీపీ అడ్మిన్ ఇందిర, డాక్టర్ అచ్యుత రావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







