రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు

- May 08, 2016 , by Maagulf
రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు

విభజన తర్వాత రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని... ఇందులో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ అధికార ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం ఈరోజు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వారిని ఒప్పించాలని జయరాంను కోరారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com