ఈద్ అల్ ఫితర్: 25 శాతం పెరిగిన బుకింగ్స్.. టాప్ గమ్యస్థానాలు ఇవే
- April 08, 2023
యూఏఈ: గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈద్ అల్ ఫితర్ 2023 కోసం ప్రయాణికులు చేసిన ట్రావెల్ బుకింగ్ల సంఖ్య 25 శాతం వరకు పెరిగాయని యూఏఈలోని కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. dnata ట్రావెల్ ప్రకారం.. యూఏఈ నుండి వెళ్లేవారు 4 లేదా 5 రోజుల స్టేయింగ్ ప్యాకేజీలను ఎంచుకుంటున్నారని, ఈద్ అల్ ఫితర్ కోసం ఆసియా గమ్యస్థానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. హిందూ మహాసముద్ర గమ్యస్థానాలు, థాయ్లాండ్లోని అతిపెద్ద ద్వీపం ఫుకెట్లోని బీచ్ రిట్రీట్ కోసం ఎక్కువగా బుకింగ్స్ ఉన్నాయని dnata ట్రావెల్లో రిటైల్ , లీజర్ హెడ్ మీరా కెటైట్ తెలిపారు. “ఈ బీచ్ రిసార్ట్ హాలిడే ప్యాకేజీలలో భాగంగా యాత్రికులు హాఫ్ బోర్డ్ లేదా అన్నీ కలిపిన డైనింగ్ ప్లాన్లను ఎంచుకుంటున్నారు. టర్కీ, స్పెయిన్, సింగపూర్, ఇటలీ, యూకేలలో సిటీ బ్రేక్లు, షాపింగ్ ట్రిప్లు ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రయాణికులు గమ్యస్థాన డైనింగ్ ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండటానికి బెడ్, బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్లను ఎంచుకుంటారు.’’ మీరా కెటైట్ పేర్కొన్నారు. ప్లూటో ట్రావెల్స్కు చెందిన భరత్ ఐదాసాని మాట్లాడుతూ.. ప్రజలు చల్లటి దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. అలాగే వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాలకు వెళ్లేందుకు యూఏఈ నివాసితులు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇప్పటివరకు జరిగిన బుకింగ్ ల ప్రకారం.. బాకు, అజర్బైజాన్, సెర్బియా అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









