నేషనల్ చారిటీ క్యాంపెయిన్ కు కింగ్ సల్మాన్ ఆమోదం

- April 09, 2023 , by Maagulf
నేషనల్ చారిటీ క్యాంపెయిన్ కు కింగ్ సల్మాన్ ఆమోదం

రియాద్: సౌదీ అరేబియా వార్షిక నేషనల్ చారిటీ క్యాంపెయిన్ కు రాజు సల్మాన్ ఆమోదించారు. సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) అభివృద్ధి చేసిన నేషనల్ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఛారిటబుల్ వర్క్ (ఎహ్సాన్)ని ఉపయోగించి ప్రజలు విరాళం ఇవ్వడానికి ఈ క్యాంపెయిన వీలు కల్పిస్తుంది.  SDAIA ప్రెసిడెంట్ అబ్దుల్లా బిన్ షరాఫ్ అల్- ఘమ్డి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో పొందుపరిచిన స్వచ్ఛంద సంస్థలకు  తమ సహకారాన్ని అందించే దాతల విస్తృత విభాగానికి చేరుకోవడానికి ప్లాట్‌ఫారమ్ అప్‌గ్రేడ్ చేయబడిందన్నారు. "ప్లాట్‌ఫారమ్ విరాళాలను సేకరించడానికి, లబ్ధిదారులకు సహాయాన్ని అందించడానికి సురక్షితమైన, విశ్వసనీయ చెల్లింపు పద్ధతిని అందజేస్తుంది" అని అల్-ఘమ్డి తెలిపారు. ఇప్పటివరకు ప్లాట్‌ఫారమ్ $880 మిలియన్లకు పైగా వసూలు అయిందని, దీని వలన 4.8 మిలియన్ల మందికి పైగా ప్రయోజనం అందిందని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com