ఆన్లైన్ లో బైక్ సేల్ పేరిట Dh44,000 మోసం.. ఇద్దరికి జైలుశిక్ష
- April 10, 2023దుబాయ్: షాపింగ్ వెబ్సైట్లో నకిలీ ప్రకటనలు పోస్ట్ చేసి ఆన్లైన్ షాపింగ్ చేసే వ్యక్తిని 44,000 దిర్హామ్ లు మోసం చేసిన ఇద్దరు ఆఫ్రికన్లకు దుబాయ్ మిస్డిమినర్ కోర్టు ఒక నెల జైలుశిక్ష, ఆ తర్వాత యూఏఈ నుండి బహిష్కరణ విధించింది. గల్ఫ్ పౌరుడిని మోసం చేసినందుకు దోషులుగా తేలిన తర్వాత వారిని ఇంటర్నెట్ను ఉపయోగించకుండా నిషేధించారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా 22,000 దిర్హామ్లకు బైక్ను అమ్ముతానని బాధితుడిని మోసం చేశారు. బీమా, కస్టమ్స్ ఫీ వంటి కారణాలతో రెండుసార్లు బాధితుడి నుంచి నిందితులు Dh44,000 వసూలు చేశారు. చివరకు షిప్మెంట్ను డెలివరీ చేయడానికి 5,000 దిర్హామ్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసానికి గురైనట్లు గ్రహించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. కేసును విచారించిన కోర్టు నిందితులిద్దరిని దోషులుగా తేల్చి శిక్షలు విధించింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం