ఆన్‌లైన్ లో బైక్ సేల్ పేరిట Dh44,000 మోసం.. ఇద్దరికి జైలుశిక్ష

- April 10, 2023 , by Maagulf
ఆన్‌లైన్ లో బైక్ సేల్ పేరిట Dh44,000 మోసం.. ఇద్దరికి జైలుశిక్ష

దుబాయ్: షాపింగ్ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రకటనలు పోస్ట్ చేసి ఆన్‌లైన్ షాపింగ్ చేసే వ్యక్తిని 44,000 దిర్హామ్ లు మోసం చేసిన ఇద్దరు ఆఫ్రికన్‌లకు దుబాయ్ మిస్‌డిమినర్ కోర్టు ఒక నెల జైలుశిక్ష, ఆ తర్వాత యూఏఈ నుండి బహిష్కరణ విధించింది. గల్ఫ్ పౌరుడిని మోసం చేసినందుకు దోషులుగా తేలిన తర్వాత వారిని ఇంటర్నెట్‌ను ఉపయోగించకుండా నిషేధించారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా 22,000 దిర్హామ్‌లకు బైక్‌ను అమ్ముతానని బాధితుడిని మోసం చేశారు. బీమా, కస్టమ్స్ ఫీ వంటి కారణాలతో రెండుసార్లు బాధితుడి నుంచి నిందితులు Dh44,000 వసూలు చేశారు.  చివరకు షిప్‌మెంట్‌ను డెలివరీ చేయడానికి 5,000 దిర్హామ్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసానికి గురైనట్లు గ్రహించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. కేసును విచారించిన కోర్టు నిందితులిద్దరిని దోషులుగా తేల్చి శిక్షలు విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com