ఆన్లైన్ లో బైక్ సేల్ పేరిట Dh44,000 మోసం.. ఇద్దరికి జైలుశిక్ష
- April 10, 2023
దుబాయ్: షాపింగ్ వెబ్సైట్లో నకిలీ ప్రకటనలు పోస్ట్ చేసి ఆన్లైన్ షాపింగ్ చేసే వ్యక్తిని 44,000 దిర్హామ్ లు మోసం చేసిన ఇద్దరు ఆఫ్రికన్లకు దుబాయ్ మిస్డిమినర్ కోర్టు ఒక నెల జైలుశిక్ష, ఆ తర్వాత యూఏఈ నుండి బహిష్కరణ విధించింది. గల్ఫ్ పౌరుడిని మోసం చేసినందుకు దోషులుగా తేలిన తర్వాత వారిని ఇంటర్నెట్ను ఉపయోగించకుండా నిషేధించారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా 22,000 దిర్హామ్లకు బైక్ను అమ్ముతానని బాధితుడిని మోసం చేశారు. బీమా, కస్టమ్స్ ఫీ వంటి కారణాలతో రెండుసార్లు బాధితుడి నుంచి నిందితులు Dh44,000 వసూలు చేశారు. చివరకు షిప్మెంట్ను డెలివరీ చేయడానికి 5,000 దిర్హామ్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసానికి గురైనట్లు గ్రహించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. కేసును విచారించిన కోర్టు నిందితులిద్దరిని దోషులుగా తేల్చి శిక్షలు విధించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







