క్రేన్కు విద్యుత్ తీగ తగలడంతో.. ఇద్దరు మృతి
- April 10, 2023
కువైట్: సాల్మీ స్క్రాప్యార్డ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఉపవాసం విరమించే(ఇఫ్తార్) సమయానికి కొన్ని క్షణాల ముందు మృత్యువాత పడటం స్థానికంగా అందరినీ కలచి వేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న క్రేన్ విద్యుత్ తీగలకు తాకడంతో ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగకు, వాహనం తీసుకెళ్తున్న క్రేన్కు మధ్య ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. వెంచ్పై ఉంచేందుకు వాహనాన్ని ఎత్తుతుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి డ్రైవర్, వాహన యజమాని స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ ను డిస్కనెక్ట్ చేసి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







