క్రేన్కు విద్యుత్ తీగ తగలడంతో.. ఇద్దరు మృతి
- April 10, 2023
కువైట్: సాల్మీ స్క్రాప్యార్డ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఉపవాసం విరమించే(ఇఫ్తార్) సమయానికి కొన్ని క్షణాల ముందు మృత్యువాత పడటం స్థానికంగా అందరినీ కలచి వేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న క్రేన్ విద్యుత్ తీగలకు తాకడంతో ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగకు, వాహనం తీసుకెళ్తున్న క్రేన్కు మధ్య ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. వెంచ్పై ఉంచేందుకు వాహనాన్ని ఎత్తుతుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి డ్రైవర్, వాహన యజమాని స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ ను డిస్కనెక్ట్ చేసి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







