విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సమాధానం చెప్పాలి: ఏపీ పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు
- April 11, 2023
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించిన విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ తీసుకొస్తుందన్నారు. త్వరలో రాహుల్ గాంధీ విశాఖలో పర్యటిస్తారని గిడుగు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మీడియా సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









