స్టాక్ ధరల తారుమారు.. 17 మంది అరెస్ట్
- April 13, 2023
రియాద్: క్యాపిటల్ మార్కెట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 17 మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) ప్రకటించింది. సీఎంఏ నుండి లైసెన్స్ పొందకుండానే సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పెట్టుబడిదారుల కోసం రెండు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలను నిందితుల్లో కొందరు ప్రయత్నించారు. మార్కెట్లో లీస్ట్ చేయబడిన అనేక కంపెనీల షేర్ల ధరలను ప్రభావితం చేసే లక్ష్యంతో కొనుగోలు ఆర్డర్లను ఇవ్వడం ద్వారా అవకతవకలకు పాల్పడ్డారని అథారిటీ పేర్కొంది. సీఎంఏ పెట్టుబడిదారులు, డీలర్లు సెక్యూరిటీలలో తమ లావాదేవీలను అథారిటీ ద్వారా లైసెన్స్ పొందిన క్యాపిటల్ మార్కెట్ సంస్థలకు పరిమితం చేయాలని, లైసెన్స్ లేని వ్యక్తులతో వ్యవహరించవద్దని పిలుపునిచ్చింది. సెక్యూరిటీల వివాదాల పరిష్కారం కోసం కమిటీల జనరల్ సెక్రటేరియట్.. నిందితుల విచారణ, నేరారోపణ తర్వాత అనుమానితుల పేర్లను వెల్లడిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







