1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- January 14, 2026
కువైట్ః 2025లో 1,197 మందికి పైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదకద్రవ్య సంబంధిత కేసులలో వారు పాల్గొన్నారని నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కబజార్డ్ తెలిపారు. కువైట్ కెమికల్ సొసైటీ నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. 2025లో మాదకద్రవ్యాల వ్యాప్తిని, ముఖ్యంగా సింథటిక్ పదార్థాలను నియంత్రణకు తీసుకొచ్చిన కొత్త చట్టం గురించి వివరించారు.
2025లో అధికారులు 3,039 మాదకద్రవ్య కేసులను నమోదు చేసి 3,871 మంది అనుమానితులను అరెస్టు చేశారని తెలిపారు. వారందరినీ డ్రగ్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు ఆయన వెల్లడించారు. పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిలో దాదాపు మూడు టన్నుల మాదకద్రవ్యాలు మరియు దాదాపు 10 మిలియన్ సైకోట్రోపిక్ మాత్రలు ఉన్నాయని అన్నారు. కువైట్ మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణా మరియు పంపిణీలో అధునాతన పద్ధతులను ఉపయోగించే వ్యవస్థీకృత నేర నెట్వర్క్లను ఎదుర్కొంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









