1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- January 14, 2026
కువైట్ః 2025లో 1,197 మందికి పైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదకద్రవ్య సంబంధిత కేసులలో వారు పాల్గొన్నారని నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కబజార్డ్ తెలిపారు. కువైట్ కెమికల్ సొసైటీ నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. 2025లో మాదకద్రవ్యాల వ్యాప్తిని, ముఖ్యంగా సింథటిక్ పదార్థాలను నియంత్రణకు తీసుకొచ్చిన కొత్త చట్టం గురించి వివరించారు.
2025లో అధికారులు 3,039 మాదకద్రవ్య కేసులను నమోదు చేసి 3,871 మంది అనుమానితులను అరెస్టు చేశారని తెలిపారు. వారందరినీ డ్రగ్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు ఆయన వెల్లడించారు. పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిలో దాదాపు మూడు టన్నుల మాదకద్రవ్యాలు మరియు దాదాపు 10 మిలియన్ సైకోట్రోపిక్ మాత్రలు ఉన్నాయని అన్నారు. కువైట్ మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణా మరియు పంపిణీలో అధునాతన పద్ధతులను ఉపయోగించే వ్యవస్థీకృత నేర నెట్వర్క్లను ఎదుర్కొంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







