1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- January 14, 2026
కువైట్ః 2025లో 1,197 మందికి పైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదకద్రవ్య సంబంధిత కేసులలో వారు పాల్గొన్నారని నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కబజార్డ్ తెలిపారు. కువైట్ కెమికల్ సొసైటీ నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. 2025లో మాదకద్రవ్యాల వ్యాప్తిని, ముఖ్యంగా సింథటిక్ పదార్థాలను నియంత్రణకు తీసుకొచ్చిన కొత్త చట్టం గురించి వివరించారు.
2025లో అధికారులు 3,039 మాదకద్రవ్య కేసులను నమోదు చేసి 3,871 మంది అనుమానితులను అరెస్టు చేశారని తెలిపారు. వారందరినీ డ్రగ్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు ఆయన వెల్లడించారు. పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిలో దాదాపు మూడు టన్నుల మాదకద్రవ్యాలు మరియు దాదాపు 10 మిలియన్ సైకోట్రోపిక్ మాత్రలు ఉన్నాయని అన్నారు. కువైట్ మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణా మరియు పంపిణీలో అధునాతన పద్ధతులను ఉపయోగించే వ్యవస్థీకృత నేర నెట్వర్క్లను ఎదుర్కొంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









