అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- January 13, 2026
న్యూ ఢిల్లీ: భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొనాల్సిందిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆమెకు అధికారికంగా ఆహ్వాన లేఖ అందింది. ఇటీవల జరిగిన తొలి అంధుల మహిళా టీ20 ప్రపంచకప్లో భారత జట్టును టైటిల్ విజేతగా నిలిపిన దీపిక ప్రతిభను గుర్తించి రాష్ట్రపతి ఈ ఆహ్వానం పంపారు.
అంధత్వాన్ని జయించి క్రికెట్ శిఖరాలకు దీపిక ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.
దీపికకు ఒక కన్ను చూపు కోల్పోయిన మనోధైర్యంతో క్రికెట్ రంగంలో అడుగుపెట్టిన ఆమె, తన అద్భుత ప్రతిభతో భారత మహిళా అంధుల జట్టుకు కెప్టెన్ గా ఎదిగారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరపున ఆడుతూ అనేక విజయాలను అందించారు. క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, పట్టుదలే నేడు ఆమెను దేశ రాజధానిలో జరిగే అత్యున్నత వేడుకలకు అతిథిగా నిలబెట్టాయి.
రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడం పై దీపిక తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ అపురూప గౌరవానికి గాను దీపిక రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









