స్టాక్ ధరల తారుమారు.. 17 మంది అరెస్ట్
- April 13, 2023
రియాద్: క్యాపిటల్ మార్కెట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 17 మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) ప్రకటించింది. సీఎంఏ నుండి లైసెన్స్ పొందకుండానే సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పెట్టుబడిదారుల కోసం రెండు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలను నిందితుల్లో కొందరు ప్రయత్నించారు. మార్కెట్లో లీస్ట్ చేయబడిన అనేక కంపెనీల షేర్ల ధరలను ప్రభావితం చేసే లక్ష్యంతో కొనుగోలు ఆర్డర్లను ఇవ్వడం ద్వారా అవకతవకలకు పాల్పడ్డారని అథారిటీ పేర్కొంది. సీఎంఏ పెట్టుబడిదారులు, డీలర్లు సెక్యూరిటీలలో తమ లావాదేవీలను అథారిటీ ద్వారా లైసెన్స్ పొందిన క్యాపిటల్ మార్కెట్ సంస్థలకు పరిమితం చేయాలని, లైసెన్స్ లేని వ్యక్తులతో వ్యవహరించవద్దని పిలుపునిచ్చింది. సెక్యూరిటీల వివాదాల పరిష్కారం కోసం కమిటీల జనరల్ సెక్రటేరియట్.. నిందితుల విచారణ, నేరారోపణ తర్వాత అనుమానితుల పేర్లను వెల్లడిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







