స్టాక్ ధరల తారుమారు.. 17 మంది అరెస్ట్
- April 13, 2023
రియాద్: క్యాపిటల్ మార్కెట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 17 మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) ప్రకటించింది. సీఎంఏ నుండి లైసెన్స్ పొందకుండానే సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పెట్టుబడిదారుల కోసం రెండు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలను నిందితుల్లో కొందరు ప్రయత్నించారు. మార్కెట్లో లీస్ట్ చేయబడిన అనేక కంపెనీల షేర్ల ధరలను ప్రభావితం చేసే లక్ష్యంతో కొనుగోలు ఆర్డర్లను ఇవ్వడం ద్వారా అవకతవకలకు పాల్పడ్డారని అథారిటీ పేర్కొంది. సీఎంఏ పెట్టుబడిదారులు, డీలర్లు సెక్యూరిటీలలో తమ లావాదేవీలను అథారిటీ ద్వారా లైసెన్స్ పొందిన క్యాపిటల్ మార్కెట్ సంస్థలకు పరిమితం చేయాలని, లైసెన్స్ లేని వ్యక్తులతో వ్యవహరించవద్దని పిలుపునిచ్చింది. సెక్యూరిటీల వివాదాల పరిష్కారం కోసం కమిటీల జనరల్ సెక్రటేరియట్.. నిందితుల విచారణ, నేరారోపణ తర్వాత అనుమానితుల పేర్లను వెల్లడిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!









