విల్లాల్లో వరుస దోపీడీలు.. నలుగురు దొంగల ముఠా అరెస్ట్
- April 14, 2023
దుబాయ్: ఎమిరేట్లోని విల్లాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు లాటినోల అంతర్జాతీయ ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల ముఠా 2 మిలియన్ దిర్హామ్ల విలువైన నగదు, నగలు, గడియారాలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. తాళాలు వేసిన విల్లాలనే ముఠా లక్ష్యంగా చేసుకొని.. చోరీలకు పాల్పడుతుందన్నారు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్లలోని విల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులకు ఏడు నివేదికలు అందడంతో కేసు విచారణ ప్రారంభమైందని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టర్ మేజర్ జనరల్ జమాల్ సలేం అల్-జల్లాఫ్ తెలిపారు. విల్లాల్లో ఉన్నవారు విదేశాలకు వెళ్లిన సమయంలో దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడేవారని చెప్పారు. ముఠాలోని సభ్యులపై నిఘా పెట్టగా.. ముఠా బ్యాంకు ఖాతాదారుడిని కూడా లక్ష్యంగా చేసుకుని అతని నుండి 60,000 దిర్హామ్లకు పైగా దొంగిలించడానికి ప్రయత్నించిందని తెలిపారు. ఒక ముఠా సభ్యుడు బాధితుడి వాహనం టైరుకు పంక్చర్ చేయగా, మరొకరు కారులో పడి ఉన్న డబ్బును దొంగిలిస్తూ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. విచారణలో ముఠా సభ్యులు ATM మెషీన్ల నుండి డబ్బును విత్డ్రా చేసిన తర్వాత అతని నగదును దోచుకోవడంతో పాటు విల్లాల్లో ఏడు దోపిడీలు చేసినట్లు అంగీకరించారు. తాము ఇతర దేశాల్లో కూడా ఇలాంటి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ దేశాలకు తెలియజేయడానికి దుబాయ్ పోలీసులు ఇంటర్పోల్తో సమన్వయం చేస్తున్నట్లు అల్-జల్లాఫ్ తెలిపారు. డిపార్ట్మెంట్ తన స్మార్ట్ అప్లికేషన్లో అందించిన "పోలీస్ ఐ" సేవ ద్వారా లేదా కాల్ సెంటర్ 901 లేదా ఎమర్జెన్సీ నంబర్ 999కి కాల్ చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ఉల్లంఘనలను నివేదించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







