హైదరాబాద్లో రాత్రి 12 దాటితే పబ్లు మూయాల్సిందే
- May 08, 2016
హైదరాబాద్ నగరంలో ఇక నుంచి రాత్రి 12 తర్వాత పబ్లను తప్పనిసరిగా మూయాల్సిందేనని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జూబ్లీహిల్స్లో బీటెక్ విద్యార్థిని కట్కూరి దేవి మృతి ఘటన జరిగిన రోజు ఆమె, భరత్ వెళ్లిన గచ్చిబౌలిలోని 'బీట్స్ పర్ మినట్' పబ్ రాత్రి 2.30గంటల వరకు తెరిచే ఉందని దర్యాప్తులో తేలడంతో పబ్ల నిర్వహణ వేళలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అర్ధరాత్రి 12 గంటలకే పబ్లు, క్లబ్ల్లో సంగీతం నిలిపివేయాలని, ఒంటిగంటలోపు తప్పనిసరిగా వాటిని మూయాల్సిందేనని నగర పోలీస్ చట్టంలో ఉన్న నిబంధనను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్ణీత వేళలు ముగిసిన తర్వాత నడిచే పబ్ల కార్యకలాపాలను వీడియో తీసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదంలో ఎవరి మృతికైనా కారకులయ్యే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిపై 304(పార్ట్-2) ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









