హైదరాబాద్లో రాత్రి 12 దాటితే పబ్లు మూయాల్సిందే
- May 08, 2016
హైదరాబాద్ నగరంలో ఇక నుంచి రాత్రి 12 తర్వాత పబ్లను తప్పనిసరిగా మూయాల్సిందేనని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జూబ్లీహిల్స్లో బీటెక్ విద్యార్థిని కట్కూరి దేవి మృతి ఘటన జరిగిన రోజు ఆమె, భరత్ వెళ్లిన గచ్చిబౌలిలోని 'బీట్స్ పర్ మినట్' పబ్ రాత్రి 2.30గంటల వరకు తెరిచే ఉందని దర్యాప్తులో తేలడంతో పబ్ల నిర్వహణ వేళలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అర్ధరాత్రి 12 గంటలకే పబ్లు, క్లబ్ల్లో సంగీతం నిలిపివేయాలని, ఒంటిగంటలోపు తప్పనిసరిగా వాటిని మూయాల్సిందేనని నగర పోలీస్ చట్టంలో ఉన్న నిబంధనను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్ణీత వేళలు ముగిసిన తర్వాత నడిచే పబ్ల కార్యకలాపాలను వీడియో తీసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదంలో ఎవరి మృతికైనా కారకులయ్యే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిపై 304(పార్ట్-2) ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







