తెలంగాణలో మే 10న ఇంటర్ ఫలితాలు…15న పదో తరగతి ఫలితాలు
- April 17, 2023
హైదరాబాద్: తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3న మొదలై ఏప్రిల్ 11తో ముగిశాయి. ఈ నేపథ్యంలో, వచ్చే నెలలో ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మే 10న ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంసెట్ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి.
అటు నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఇంటర్ పరీక్ష ఫలితాలను వేగంగా తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు కృషి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఇక, తెలంగాణలో జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యాబోధన ప్రారంభం కానుంది. అందుకోసం, టెన్త్ ఫలితాల వెల్లడి కోసం విద్యాశాఖ త్వరపడుతోంది. ఏప్రిల్ 21 వరకు మూల్యాంకనం, ఆ తర్వాత టాబ్యులేషన్ నిర్వహించి, మే 15న ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







