OMR 9.6 మిలియన్ల విరాళం అందజేసిన భారతీయ సంతతి వ్యాపారవేత్త

- April 17, 2023 , by Maagulf
OMR 9.6 మిలియన్ల విరాళం అందజేసిన భారతీయ సంతతి వ్యాపారవేత్త

మస్కట్: రాబోయో 10 ఏళ్లలో OMR9.6 మిలియన్లతో అనాథలు, నిరుపేద కుటుంబాల కోసం 300 ఇళ్లను నిర్మించేందుకు చేపట్టిన 'SAS' ప్రాజెక్ట్  కోసం కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)పై అల్ రహ్మా అసోసియేషన్ ఫర్ మదర్‌హుడ్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, 'శోభా' గ్రూప్ సంతకం చేశాయి. ఈ ఎంఓయూపై అల్ రహ్మా అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్‌వుమన్ సనా అబ్దుల్ రెహ్మాన్ అల్ ఖంజరీ, శోభా గ్రూప్ వ్యవస్థాపకుడు- చైర్మన్ పీఎన్‌సీ మీనన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా పిఎన్‌సి మీనన్ మాట్లాడుతూ.. “ఒకరి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఆహారం, గృహం, విద్య. కాబట్టి, ఏ కుటుంబానికైనా ఇల్లు చాలా ముఖ్యమైన విషయం. అందుకే అనాథలు, నిరుపేదల కోసం గృహనిర్మాణం చేద్దాం అనుకున్నాను. అందుకే పదేళ్లలో 300 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించాం. కానీ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. నేను 7 డాలర్లతో ఒమన్ వచ్చాను. ఒమన్ నాకు అన్ని ఇచ్చింది.’’ అని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. భూములు ఉంటే ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయడంతోపాటు భూమిని ఇచ్చే వారికి లేదా నివాసయోగ్యం కాని ఇంటిని కలిగి ఉన్న వారికి ప్రత్యేక ఇళ్లను నిర్మించడం వంటివి అందిస్తుంది. ఒక్కో ఇంటికి నిర్మాణ విస్తీర్ణం 200 చదరపు మీటర్లు కాగా.. ఒక్కో ఇంటి నిర్మాణానికి OM35,000 కేటాయించారు. ఒమన్ సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జర్ ఆధ్వర్యంలో ఎంఓయూపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com