తేజుకి ‘విరూపాక్ష’ ఓ అగ్ని పరీక్ష.!

- April 18, 2023 , by Maagulf
తేజుకి ‘విరూపాక్ష’ ఓ అగ్ని పరీక్ష.!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ శుక్రవారం ‘విరూపాక్ష’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత తేజు నుంచి వస్తున్న సినిమా ఇది.

యాక్సిడెంట్‌కి గురైన తర్వాత చాలా కాలం అజ్ఞాతంలోనే వుండిపోయాడు తేజు. అసలు సాయి ధరమ్ తేజ్‌కి ఏమైంది.? అంటూ రకరకాలుగా అభిమానులు ఆందోళన చెందారు. కానీ, ఆ తర్వాత కొన్ని నెలల పాటూ దాదాపు ఓ సంవత్సరం పాటు మీడియానీ, అభిమానుల్నీ ఫేస్ చేయలేకపోయాడు తేజు.

ఇంతమంది అభిమానుల అభిమానమే తనను మళ్లీ సినిమాల్లోకి వచ్చేలా చేసిందని తాజాగా ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజు ఎమోషనల్ అయ్యాడు. 

ఫ్యాన్స్ కోసం చేసిన సినిమానే ‘విరూపాక్ష’ అనీ తేజు చెప్పాడు. సుకుమార్ నిర్మాణంలో ఆయన కథతో రూపొందిన చిత్రమిది. కార్తిక్ దండు అను కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ కట్టబెడతారో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com