మాస్ డైరెక్టర్తో సాయి ధరమ్ తేజ్.!
- April 19, 2023
మాస్ మసాలా డైరెక్టర్గా సంపత్ నందికి మంచి పేరుంది. ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన, రెండో సినిమాకే చరణ్ వంటి స్టార్ హీరోతో ‘రచ్చ’ సినిమా తీసి రచ్చ రచ్చ చేశాడు.
ఆ తర్వాత నుంచీ సంపత్ నందికి పెద్దగా కలిసి రావడం లేదు. ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అంటూ గోపీచంద్తో ఓ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.
తాజాగా సంపత్ నంది ఓ మెగా హీరో కోసం అదిరిపోయే కథ రాసుకున్నాడట. ఆ మెగా హీరో మరెవరో కాదు, సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘విరూపాక్ష’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న తేజు, సంపత్ నంది కథకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది.
చూడాలి మరి తేజును తన సినిమాలో ఎలా చూపించబోతున్నాడో సంపత్ నంది. తనకు బాగా కలిసొచ్చిన మెగా కాంపౌండ్ హీరోతో ఎలాగైనా హిట్టు కొట్టి, మళ్లీ తన సత్తా చాటాలనుకుంటున్నాడట సంపత్ నంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!







