మాస్ డైరెక్టర్తో సాయి ధరమ్ తేజ్.!
- April 19, 2023
మాస్ మసాలా డైరెక్టర్గా సంపత్ నందికి మంచి పేరుంది. ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన, రెండో సినిమాకే చరణ్ వంటి స్టార్ హీరోతో ‘రచ్చ’ సినిమా తీసి రచ్చ రచ్చ చేశాడు.
ఆ తర్వాత నుంచీ సంపత్ నందికి పెద్దగా కలిసి రావడం లేదు. ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అంటూ గోపీచంద్తో ఓ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.
తాజాగా సంపత్ నంది ఓ మెగా హీరో కోసం అదిరిపోయే కథ రాసుకున్నాడట. ఆ మెగా హీరో మరెవరో కాదు, సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘విరూపాక్ష’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న తేజు, సంపత్ నంది కథకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది.
చూడాలి మరి తేజును తన సినిమాలో ఎలా చూపించబోతున్నాడో సంపత్ నంది. తనకు బాగా కలిసొచ్చిన మెగా కాంపౌండ్ హీరోతో ఎలాగైనా హిట్టు కొట్టి, మళ్లీ తన సత్తా చాటాలనుకుంటున్నాడట సంపత్ నంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







